నరేష్ ఆగస్త్య, బ్రహ్మాజీ, హర్ష చెముడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మెన్ టూ’. శ్రీకాంత్ జి రెడ్డి దర్శకుడు. మౌర్య సిద్ధవరం నిర్మాత. నేడు ప్రేక్షకుల మందుకురానుంది. బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ సినిమాలో మహిళలను ఎక్కడా విమర్శించలేదు.
మగవాళ్ల కష్టాలను వినోదాత్మక కోణంలో చూపించాం’ అన్నారు. ‘వినోదం, సందేశం కలబోసిన కంటెంట్తో ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది’ అని నిర్మాత తెలిపారు. ఆడవాళ్లు మగవాళ్లను ఎలా టార్చర్ చేస్తారనే విషయాన్ని కామెడీ ప్రధానంగా చూపించారని బ్రహ్మాజీ చెప్పారు.