ఎస్ఆర్కే ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న తాజా చిత్రం ఇటీవల హైదరాబాద్లో ప్రారంభమైంది. సంపత్కుమార్ దర్శకుడు. ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ నటుడు సుమన్ క్లాప్నిచ్చారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ మాఫియా బ్యాక్డ్రాప్లో సస్పెన్స్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం’ అన్నారు.
నిర్మాత శ్రీనివాస రెడ్డి కర్రి మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నేను సీబీఐ అధికారి పాత్రలో నటిస్తున్నా’ అని చెప్పారు. ఇమ్మోర్టల్, డాండి, పూజా నాగేశ్వర్, కోటి, మల్లేష్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కథ, సంభాషణలు, దర్శకత్వం: సంపత్కుమార్.