విశాల్ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ఇటీవల ప్రారంభోత్సవం జరుపుకుంది. స్టోన్బెంచ్ ఫిల్మ్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘విశాల్, హరి కాంబినేషన్లో వచ్చిన తమిళభరణి, పూజై చిత్రాలు భారీ విజయాల్ని సాధించాయి. వారిద్దరి కలయికలో వస్తున్న ఈ హ్యాట్రిక్ చిత్రాన్ని పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించబోతున్నాం.
రొమాంచితమైన యాక్షన్ ఘట్టాలతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది. చెన్నై, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో చిత్రీకరణ జరుపుతాం. ఓ ఆసక్తికరమైన కథాంశంతో స్క్రీన్ప్లే ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాం. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో తెలియజేస్తాం’ అని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: ఎం.సుకుమార్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, సహనిర్మాత: అలంకార్ పాండియన్, రచన-దర్శకత్వం: హరి.