The Kerala Story | దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారింది ‘ది కేరళ స్టోరీ’ చిత్రం. అదాశర్మ హీరోయిన్గా సుదీప్తోసేన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రాన్ని పలువురు సమర్థిస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన వివాదం సుప్రీంకోర్టుకెక్కింది. ఇటీవల సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని కేరళ హైకోర్టును ఆశ్రయించగా.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ క్రమంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఈ నెల 15న విచారించేందుకు జాబితా చేసింది.
వాస్తవానికి ‘ది కేరళ స్టోరీ’ చిత్రం ట్రైలర్లో ఏ అభ్యంతరం లేదని పేర్కొంటూ గతవారం కేరళ హైకోర్టు చిత్రం రిలీజ్పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ క్రమంలోనే అత్యవసరంగా విచారించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ ధర్మాసనం ముందుకు పిటిషన్ రాగా.. సినిమా విషయంలో కేరళ హైకోర్టు ఏమైనా ఆదేశాలు జారీ చేసిందా? అని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ పిటిషనర్ను ప్రశించారు. సినిమా విడుదలపై స్టేకు నిరాకరించిందని పిటిషనర్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు తెలుపగా.. విచారణకు అంగీకరిస్తూ ఈ నెల 15న జాబితా చేసింది.