నిఖితా శ్రీ, పృథ్వీ, నాగమహేష్, జయవాణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘భ్రమర’ చిత్రం ఇటీవల హైదరాబాద్లో ప్రారంభమైంది. టీవీ రవి నారాయణన్ దర్శకుడు. బి.మురళీకృష్ణ నిర్మాత. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత బెక్కెం వేణుగోపాల్ క్లాప్నివ్వగా, ఎఫ్డీసీ ఛైర్మన్ అనిల్ కూర్మాచలం కెమెరా స్విఛాన్ చేశారు.
వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందించబోతున్న థ్రిల్లర్ చిత్రమిదని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: రాహుల్ శ్రీ వాత్సవ్, సంగీతం: కార్తీక్ బి కొడగండ్ల, నిర్మాణం: జీయంకె ఎంటర్టైన్మెంట్.