Cinema News | మహాభారతంలోని అశ్వత్థామ పాత్రను ఆధునిక యుగానికి పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం ‘అశ్వత్థామ ది సాగా కంటిన్యూస్’. షాహిద్ కపూర్ కథానాయకుడిగా నటిస్తున్నారు. సచిన్ రవి దర్శకుడు. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకురానుంది. దర్శకుడు మాట్లాడుతూ ‘అశ్వత్థామకు మరణం లేదు. అతను చిరంజీవి. ఇప్పుటికీ అశ్వత్థామ బతికే ఉన్నారని నమ్ముతుంటారు.
ప్రస్తుత యుగంలో అశ్వత్థామకు ఎదురైన సవాళ్లేమిటో ఈ సినిమాలో చూపించబోతున్నాం. అశ్వత్థామ పౌరాణిక గాథ ను లోతుగా అధ్యయం చేసి ఈ సినిమా తీస్తున్నా. ఆరువేల సంవత్సరాలుగా తాను చూసిన ప్రపంచం నుంచి అతను ఏం గ్రహించాడు? అతని అన్వేషణ ఏమిటనే అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి. భారీ యాక్షన్ ఘట్టాలతో తెరకెక్కించబోతున్నాం’ అన్నారు. పూజా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వాషు భగ్నానీ, జాకీ భగ్నానీ, దీష్షికా దేశ్ముఖ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.