Balakrishna | వరుస హిట్లతో దూసుకుపోతున్నారు నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం ఆయన బాబీ(కె.ఎస్.రవీంద్ర) దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల కారణంగా ఈ సినిమా షూటింగ్కి బాలకృష్ణ బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తున్నది. ఈ లోపు బాలకృష్ణ లేని సన్నివేశాలతో పాటు పనిలో పనిగా పోస్ట్ప్రొడక్షన్ కూడా కానిచ్చేస్తున్నారు చిత్రయూనిట్. ఇదిలావుంటే.. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ చేసే సినిమా విషయంలో చాలా వార్తలు వినిపిస్తున్నాయి.
‘అఖండ-2’ చేస్తారని చాలామంది అంటున్నారు. అయితే.. ఊహించని విధంగా మలినేని గోపీచంద్ కథకే బాలయ్య పచ్చజెండా ఊపేశారని విశ్వసనీయ సమాచారం. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఇటీవల గోపీచంద్ ఓ పవర్ఫుల్ కథ బాలయ్యకు వినిపించారట. ఆ కథ ఆయనకు విపరీతంగా నచ్చడంతో ఓకే అన్నారని తెలిసింది. మైత్రీమూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు తెలుస్తున్నది. ఇంకా ఈ సినిమాకు చెందిన మిగతా వివరాలు తెలియాల్సివుంది.