‘మా’ అధ్యక్షుడిగా (Maa Elections) ఎన్నికైన మంచు విష్ణు ‘మా’ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. విష్ణు (Manchu Vishnu) నేతృత్వంలోని ‘మా’ కొత్త టీం ఈ నెల 16న ప్రమాణస్వీకారం చేయబోతుంది. ఈ నేపథ్యంలో నటుడు మోహన్ బాబు (Mohan babu) తమకు మద్దతు ఇచ్చిన వారితోపాటు మిగిలిన అందరినీ కూడగట్టే పనిలో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా ఇవాళ మోహన్బాబు, విష్ణుతో కలిసి బాలకృష్ణ (Balakrishna) ఇంటికి వెళ్లారు. బాలకృష్ణతో పలు విషయాలపై చర్చించారు.
అనంతరం మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. విష్ణుకు తోడుంటానని మా ఎన్నికల సమయంలో బాలకృష్ణ ప్రకటించారు. అన్నట్టుగానే విష్ణుకు అండగా ఉండి ఓటేశారు. గత ఎన్నికల్లో బాలయ్య బాబు అల్లుడిని ఓడించడానికి ప్రచారం చేశాను. అన్నీ మరిచిపోయి బాలకృష్ణ ఓటేశారని, అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.
‘మా’ ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాలపై ప్రకాశ్రాజ్ ప్యానెల్ సభ్యులు ప్రెస్ మీట్ పెట్టి పలు విమర్శలు చేయడంతో హాట్ టాపిక్గా మారిపోయింది. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి ఎన్నికైన 11 మంది రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మంచు విష్ణు చేసే పనులకు బయట నుంచి సహకరిస్తూ..ఎప్పటికపుడు రిపోర్టు తెప్పించుకుని ప్రశ్నిస్తామని ప్రకాశ్ రాజ్ టీం చెప్పింది. ఈ నేపథ్యంలో బాలకృష్ణతో మోహన్ బాబు సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇది కూడా చూడండి
Malavika Mohanan | మాళవికా మోహనన్కు నెటిజన్లు ఫిదా
Manchi Rojulochaie Trailer| ఆనందానికి కేరాఫ్ అడ్రెస్ వీడు..’మంచి రోజులొచ్చాయి’ ట్రైలర్
Akhil Akkineni | గత పదేళ్ల నుంచి తనకిష్టమైన ఫొటో చూపించిన అఖిల్
Rowdy Boys | కలర్ఫుల్ పాటతో చిత్రీకరణ పూర్తి