Thani Oruvan | జయం రవి (Jaym Ravi), నయనతార (Nayanathara), అరవింద్ స్వామి (Aravindh Swamy) ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం తని ఒరువన్ (Thani Oruvan). ఈ సినిమాకు గాడ్ ఫాదర్ ఫేమ్ మోహన్ రాజా (Mohan Raaja) దర్శకత్వం వహించాడు. 2015లో వచ్చిన ఈ చిత్రం తమిళంలో బిగ్గెస్టు బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇదే సినిమాను రామ్ చరణ్ ధ్రువ (Dhruva) పేరుతో తెలుగులో రీమేక్ చేశాడు. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి (Surendhar Reddy) దర్శకత్వం వహించాడు. ఇక్కడ కూడా ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. కాగా ఈ చిత్రం విడుదలై నేటికి 8 ఏండ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ మూవీ సీక్వెల్ సంబంధించి సాలిడ్ అప్డేట్ వచ్చింది.
తని ఒరువన్ విడుదలై 8 ఏండ్లు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా దర్శకుడు మోహన్ రాజా ఓ పోస్టు పెట్టాడు. ”నా జీవితంలో గుర్తుంచుకోవలసిన ప్రత్యేకమైన రోజు ఇది తని ఒరువన్ విడుదలై 8 ఏండ్లు పూర్తి చేసుకుంది. అలాగే.. ఇవాళ నాకు మరింత ప్రత్యేకం ఎందుకు అంటే ఇంకో పెద్దకలకి పునాది వేస్తున్న అంటూ మోహన్ రాజా ట్విట్టర్లో పోస్టు పెట్టాడు. కాగా ఇది తని ఒరువన్ 2 (Thani Oruvan 2) సీక్వెల్కు సంబంధించిన విషయమే కావచ్చు అంటూ నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ కూడా సాయంత్రం 6 గంటలకు అప్డేట్ ఇవ్వనున్నట్లు పోస్టు పెట్టింది.
#8yearsofThanioruvan
A special day to remember in my life 🙏
And today becomes even more special as a bigger dream begins 👍@Ags_production— Mohan Raja (@jayam_mohanraja) August 27, 2023
Tomorrow at 6 #AGSProduction26 coming your way 🔥@archanakalpathi @aishkalpathi @venkatManickam5 @agscinemas @onlynikil pic.twitter.com/0BkKQYrGC8
— AGS Entertainment (@Ags_production) August 27, 2023