గంభీరావుపేట, మే 17: చేసిన పనులకు బిల్లులు రాలేదని తాజా మాజీ సర్పంచ్ పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి నిరసనకు దిగాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోళ్లమద్ది తాజా మాజీ సర్పంచ్ కేశవరావు రూ.20 లక్షలతో గ్రామ పంచాయతీ భవనం, రూ. 8 లక్షలతో అభివృద్ధి పనులు చేశాడు.
బిల్లులు రాకపోవడంతో శుక్రవారం జీపీకి తాళం వేసి నిరసన తెలిపాడు. తనకు రావాల్సిన రూ. 28 లక్షల బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశాడు.