జనగామ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సినిమా రంగంలో తెలంగాణ వారి ప్రాధాన్యం పెరిగిందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) అన్నారు. జనగామ(Janagama) జిల్లాపాలకుర్తి మండలం విసునూరు గ్రామంలో గువేరా ప్రొడక్షన్స్(Guvera Production) ఆధ్వర్యంలో నిర్మిస్తున్న సినిమా పూజ కార్యక్రమంలో పాల్గొని, సినిమా షూటింగ్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సినిమా రంగంలో తెలంగాణ పాత్ర తక్కువగా ఉండేదని, తెలంగాణ వాళ్లు పరిమిత సంఖ్యలో పనిచేసేవారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్(CM KCR) ప్రోత్సాహంతో అనేకమంది కళాకారులు(Artists), రచయితలు(Writers), దర్శకులు(Directors), నిర్మాతలు(Producers) వివిధ విభాగాల వారీగా విస్తృతంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే పలు సినిమాలు నిర్మిస్తూ మంచి పేరు గడిస్తున్నారని అన్నారు.
గువేరా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ వన్ చిత్రం కూడా గొప్ప విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు. ఈ సినిమా దర్శకుడు ఎస్ ఎస్ వర్మ, నిర్మాత శ్వేత అమర్ వాది, హీరో హీరోయిన్ లు డాక్టర్ విశ్వాస్, దివ్య దత్తాత్రేయ, సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి, కెమెరా పవన్ గుంటుకు, పాటల రచయితలు గోరటి వెంకన్న, పూర్ణా చారి, శ్రీనివాస మౌళి, మనోహర్, నటీనటవర్గం సాంకేతిక నిపుణులు, తదితరులకు మంత్రి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.