Bheema Movie | కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని టాలీవుడ్ నటుడు గోపీచంద్ దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం తిరుమల చేరుకున్న గోపీచంద్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గోపీచంద్కి అర్చకులు ఆశీర్వాదం అందించారు. అంతకుముందు ఆలయ అర్చకులు ఆలయ సాంప్రదాయం ప్రకారం హీరో గోపీచంద్కు స్వాగతం పలికారు.
గోపీచంద్ ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం ‘భీమా’. యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమాకు కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వం వహించగా.. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా మహా శివరాత్రి కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా విజయం సాధించాలని శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు గోపీచంద్.
Team #BHIMAA sought blessings from Lord Venkateswara Swamy at Tirumala temple for the release today ❤️
Book your tickets now!
🎟 https://t.co/w1n4vF3EA8IN CINEMAS NOW💥@YoursGopichand @priya_Bshankar @ImMalvikaSharma @NimmaAHarsha @KKRadhamohan @RaviBasrur @SriSathyaSaiArt… pic.twitter.com/Td43UtwPSM
— BA Raju’s Team (@baraju_SuperHit) March 8, 2024