Balakrishna | నందమూరి బాలకృష్ణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. హిందూపురంలోని సరస్వతి విద్యామందిర్లో కంప్యూటర్లను పంపిణీ చేసిన బాలయ్య.. ఏపీ సీఎం జగన్పై విరుచుకుపడ్డారు. రాయలసీమలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు వలసలు వెళ్తున్నారని బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు రావట్లేదని.. రాష్ట్రానికి పరిశ్రమలు దూరం అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇక ఎవరైనా తనకు 60 సంవత్సరాలు అని.. వయసు అయిపోయిందని అంటే వాడికి దబిడి దిబిడే అంటూ వార్నింగ్ ఇచ్చాడు. సేవా కార్యక్రమాలు చేయాలంటే అధికారంలోనే ఉండాల్సిన అవసరం లేదని బాలయ్య అన్నాడు. కాకపోతే అభివృద్ధి చేయాలంటే మాత్రం కచ్చితంగా అధికారంలో ఉండాలని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని ఆయన అన్నారు. ఇక అక్కినేని.. తొక్కినేని అంటూ ఏఎన్నార్పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై కూడా బాలకృష్ణ స్పందించాడు.
అక్కినేని నాగేశ్వరరావును తాను కావాలని కించపరచలేదని బాలకృష్ణ స్పష్టం చేశాడు. ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇద్దరూ తెలుగు ఇండస్ట్రీకి రెండు కాళ్లలాంటి వాళ్లని తెలిపారు. అక్కినేని నాగేశ్వరరావు తనకు బాబాయ్ లాంటి వాడని పేర్కొన్నాడు. తన పిల్లల కంటే కూడా ఎక్కువగా తనను అప్యాయంగా చూసుకునేవాడని బాలకృష్ణ తెలిపాడు. నాన్న గారి నుంచి క్రమశిక్షణ నేర్చుకుంటే.. బాబాయ్ ఏఎన్నార్ నుంచి పొగడ్తలకు దూరంగా ఉండాలన్న విషయాన్ని తెలుసుకున్నానని వెల్లడించాడు.
Balakrishna | బాబాయిపై ప్రేమ గుండెల్లో ఉంటుంది.. అక్కినేని వివాదంపై బాలకృష్ణ