రీసెంట్గా ‘వీరసింహా రెడ్డి’ విజయోత్సవ వేడుకలో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) లెజెండరీ యాక్టర్లపై మాట్లాడిన మాటలు వివాదాస్పదమయ్యాయని తెలిసిందే. బాలకృష్ణ స్పీచ్లో అక్కినేని తొక్కినేని అంటూ మాట్లాడిన మాటలు హైలెట్ అయ్యాయి. దీనిపై అక్కినేని నాగేశ్వర్రావు (Akkineni Nageshwarrao) అభిమానులు మండిపడుతూ.. బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో బాలకృష్ణ తన వ్యాఖ్యలపై మీడియా ముఖంగా క్లారిటీ ఇచ్చారు. తాను యాదృశ్చికంగా మాట్లాడిన మాటలే తప్ప ఆయన్ను (అక్కినేని నాగేశ్వర్ రావు) కించపరచలేదని స్పష్టం చేశారు. నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వర్ రావు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు రెండు కండ్ల లాంటివారన్నారు. నాన్నగారి నుంచి క్రమశిక్షణ నేర్చుకున్నానని, బాబాయి (అక్కినేని)నుంచి పొగడ్తలకు దూరంగా ఉండాలన్న విషయాన్ని తాను నేర్చుకున్నానని బాలకృష్ణ వెల్లడించారు.
యాదృశ్చికంగా వచ్చిన మాటలను తప్పుగా ప్రచారం చేస్తే తనకు సంబంధం లేదని, అక్కినేని నాగేశ్వర్రావు గారు తన పిల్లల కంటే ఎక్కువగా తనను ప్రేమించేవారని బాలకృష్ణ పేర్కొన్నారు. ఎన్టీఆర్ మరణించిన తర్వాత ఆయన పేరు మీద ఏర్పాటు చేసిన జాతీయ అవార్డును తొలిసారి అక్కినేని నాగేశ్వర్రావుకు అందించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. బాబాయిపై ప్రేమ తన గుండెల్లో ఉంటుందని, ఈ విషయంలో బయట ఏం జరిగినా తాను పట్టించుకోనని బాలకృష్ణ క్లారిటీ ఇచ్చారు. స్పీచ్లో మరో లెజెండరీ యాక్టర్ స్వర్గీయ ఎస్వీ రంగారావునుద్దేశించి ఆ రంగారావు.. ఈ రంగారావు అని కూడా సంభోధించారు బాలకృష్ణ.