తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు మూడు కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 15 గంటల్లో దర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 67,493 మంది దర్శించుకోగా 24,958 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.82 కోట్లు వచ్చిందని వివరించారు.
రేపు శ్రీవాణి టికెట్ల విడుదల
శుక్రవారం ఫిబ్రవరి నెలకు సంబంధించిన శ్రీవాణి టికెట్లను విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతిరోజు వెయ్యి టికెట్లను జారీ చేస్తుండగా 750 టికెట్లు ఆన్లైన్లో, మరో 250 టికెట్లు ఆఫ్లైన్లో జారీ చేస్తామని వెల్లడించారు.