తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘కీడా కోలా’. విజి సైన్మా పతాకంపై శ్రీపాద్ నందిరాజ్, సాయికృష్ణ గద్వాల్, ఉపేంద్రవర్మ, వివేక్ సుధాంషు, కౌషిక్ నండూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతున్నది.
ఆదివారం నుంచి రెండో షెడ్యూల్ మొదలైంది. ‘క్రైమ్ కామెడీ కథాంశమిది. కథ, కథనాలు ఉత్కంఠను పంచుతాయి. తనదైన శైలి కామెడీ అంశాలతో తరుణ్భాస్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నటీనటుల వివరాల్ని త్వరలో తెలియజేస్తాం’ అని చిత్రబృందం పేర్కొంది.