న్యూఢిల్లీ : ప్రముఖ బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఉజ్జయిని మహాకలేశ్వర్ ఆలయానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. కారు బ్రేకులు ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని తనుశ్రీ దత్తా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఫొటోలను సైతం షేర్ చేసింది.
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సైతం చికిత్స తీసుకొని ఉజ్జయిని ఆలయానికి చేరుకొని మహాకలేశ్వరుడిని దర్శించుకున్నది. ‘ఈ రోజు నా జీవితంలో మొదటి రోడ్డు ప్రమాదం జరిగింది. అది నా విశ్వాసాన్ని బలపరిచింది. ఈ రోజు నాకు చాలా సాహసోపేతమైన రోజు. ప్రమాదం జరిగినప్పటికీ నేను మహాకలేశ్వరుడిని దర్శనం చేసుకున్నాను. గుడికి వెళుతుండగా బ్రేక్ ఫెయిల్ కావడంతో నా కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం కారణంగా కొన్ని కుట్లు పడ్డాయి. మహాకాళేశ్వర్ దయతో స్వల్ప గాయాలతో బయటపడ్డాను’ అని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది.
ఇదిలా ఉండగా.. గత కొద్ది రోజులుగా తనుశ్రీ దత్తా చిత్రాలకు దూరమైనా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నది. ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నా ఈ అమ్మడు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇమ్రాన్ హష్మీ సరసన ‘ఆషిక్ బనాయా ఆప్నే’తో సినిమాల్లోకి అడుగుపెట్టిన తనుశ్రీ. తెలుగులోనూ బాలకృష్ణ సరసన వీరభద్ర చిత్రంలో నటించింది.