తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఢిల్లీ బ్యూటీ తాప్సీ పన్ను (Taapsee Pannu). ఎప్పుడూ స్వీట్గా, కామ్గా కనిపించే తాప్సీకి కోపమొచ్చింది. ఇంతకీ ఈ భామకు కోపం రావడానికి కారణమేంటనే కదా మీ డౌటు. ‘దొబారా’ (Dobaaraa) సినిమా ఫెయిల్యూర్పై ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ..భాయ్ ఓ ప్రశ్న అడిగే ముందు దానిపై కొంత పరిశోధన చేయండి అని తనదైన స్టైల్లో ఆ రిపోర్టర్కు చురకలింటించింది తాప్సీ.
తాప్సీ నటించిన ‘దొబారా’ సినిమా చుట్టూ జరిగిన ‘నెగెటివ్ క్యాంపెయిన్ ’పై (negative campaign) రిపోర్టర్ ప్రశ్నించాడు. ఏ సినిమాకు నెగెటివ్ క్యాంపెయిన్ లేదో చెప్పాలని తాప్సీ ఆ రిపోర్టర్ను అడిగింది. అయితే ఆ రిపోర్టర్ తాప్సీ ప్రశ్నకు సమాధానమివ్వలేదు. తాప్సీ అంతటితో ఆగకుండా మీరు నా ప్రశ్నకు సమాధానమివ్వండి. నేను మీకు జవాబిస్తా. ఏ సినిమాకు నెగెటివ్ క్యాంపెయిన్ తప్పిందో చెప్పాలి..అని ఆ రిపోర్టర్ను మరోసారి ప్రశ్నించింది.
ఆ తర్వాత ఫిల్మ్ క్రిటిక్స్ కూడా దొబారా చిత్రానికి నెగెటివ్ క్యాంపెయిన్ చేశారని రిపోర్టర్ అన్నాడు. దీంతో ‘నన్ను ఓ ప్రశ్న అడిగే కన్నా ముందు కొంత పరిశోధన చేసి రావాలని‘ గట్టిగా రిపోర్టర్కు సమాధానమిచ్చింది. ఓటీటీ ప్లే అవార్డ్స్-2022 ఈవెంట్లో (OTT Play Awards 2022) రిపోర్టర్కు తాప్సీకి మధ్య జరిగిన ఈ ప్రశ్నల వర్షం వీడియో ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
తాప్సీ ప్రస్తుతం హిందీలో షారుక్ ఖాన్-రాజ్కుమార్ హిరానీ ప్రాజెక్టు డుంకీ చేస్తోంది. దీంతోపాటు రెండు హిందీ, రెండు తమిళ సినిమాలు తాప్సీ ఖాతాలో ఉన్నాయి.
Read Also : Gautham Menon | ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’లో శింబు కనిపించడు.. ముత్తు మాత్రమే కనిపిస్తాడు : గౌతమ్ మీనన్ ఇంటర్వ్యూ
Read Also : Nagarjuna Akkineni | నలుగురు దర్శకులకు 100వ సినిమా బాధ్యతలు..ఇంతకీ వాళ్లెవరో..?