శ్రీరామ్ (Sriram), సంచితా పదుకునే (Sanchita Padukone) జంటగా నటించిన చిత్రం అసలేం జరిగింది (Asalem Jarigindi). ఎన్వీఆర్ (Nuleti Veera Raghava) దర్శకత్వంలో ఎక్సోడస్ మీడియా పతాకంపై మైనేని నీలిమా చౌదరి, కింగ్ జాన్సన్ కొయ్యడ నిర్మించారు. ఈ నెల 22న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో జరిగిన వాస్తవిక సంఘటన ఆధారంగా రూపొందించిన చిత్రమిది. ఓ అదృశ్యశక్తితో చేసిన పోరాటమే ఈ చిత్రమన్నారు.
ఓ కొత్త తరహా కాన్సెప్ట్తో తెరకెక్కించిన ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠకు గురిచేస్తుంది. పూర్తి కమర్షియల్ కమర్షియల్ ఎలిమెంట్స్తో రూపొందిన ఈ హారర్ థ్రిల్లర్ సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఈ చిత్రాన్ని తప్పకుండా థియేటర్స్లో విడుదల చేయాలని అనుకున్నాం. ఈ నెల 22న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. తప్పకుండా ఈ సినిమా అందరి ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉందన్నారు.
ఇది కూడా చూడండి
Sunny Leone | స్వర్గంలో ఏంజెల్లా సన్నీలియోన్
Prakash Raj Panel | 11 మంది ప్రకాశ్రాజ్ ప్యానెల్ సభ్యుల రాజీనామా
Benerjee | మోహన్ బాబు నన్ను కొట్టడానికి వచ్చారు: బెనర్జీ