Sushant Singh Rajput Case | బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసు దర్యాప్తులో భాగంగా బాలీవుడ్ నటి రియా చక్రవర్తిపై సీబీఐ లుకౌట్ సర్కుల్యర్ జారీ చేసింది. దాన్ని సవాల్ చేస్తూ రియా బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తాను ఓ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగుతున్నానని.. దాని కోసం డిసెంబర్ 27 నుంచి జనవరి వరకు దుబాయికి వెళ్లేందుకు లుక్ అవుట్ సర్క్యులర్ను నిలిపివేయాలని కోరింది. ఈ పిటిషన్పై విచారించిన కోర్టు రియా చక్రవర్తి చెప్పిన కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగుందా? లేదా? ధ్రువీకరించాలని ఆదేశించింది.
జస్టిస్ ఏఎస్ గడ్కరీ, జస్టిస్ ఏసీ చందక్ డివిజన్ బెంచ్ సీబీఐ తరఫు న్యాయవాది శ్రీరామ్ శిర్సత్ మాట్లాడుతూ పెట్ ఫుడ్ కంపెనీకి రియా బ్రాండ్ అంబాసిడర్ కాదని.. ఆమె స్థానంలో మరొకరిని నియమించినట్లు తెలిపారు. ఆ కంపెనీకి కియారా అద్వానీ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారని తెలిపిందని, దాన్ని వేరిఫై చేసేందుకు మరికొంత సమయం కావాలని కోరారు. రియా తరఫున న్యాయవాది అభినవ్ చంద్రచూడ్ కేసు విచారణను డిసెంబర్ 22న మరోసారి జరపాలని కోరారు. అయితే, ఈ విషయంలో తొందరపడబోమని ధర్మాసనం తెలిపింది. సీబీఐకి సమయం కావాలంటే ఇవ్వాల్సి ఉంటుందని.. రియా డిసెంబర్ 26న వెకేషన్ బెంచ్ను ఆశ్రయించవచ్చని కోర్టు తెలిపింది.