తమిళ అగ్ర హీరో సూర్య తాజా తమిళ చిత్రం ‘కరుప్పు’ తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో విడుదల కానుంది. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ప్రకాష్బాబు, ఎస్.ఆర్.ప్రభు నిర్మిస్తున్నారు. ఈ నెల 14న దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. తాజాగా ఈ చిత్రానికి సెన్సార్ పూర్తయింది. యు.ఏ. సర్టిఫికెట్ లభించింది.
ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభిస్తున్నదని, సామాజిక సందేశం కలబోసిన యాక్షన్ చిత్రమిదని, సూర్య నట విశ్వరూపం చూస్తారని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో సూర్య న్యాయవాదిగా కనిపించనున్నారు. సామాజిక, ఆధ్యాత్మిక అంశాల కలబోతగా యాక్షన్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి సంగీతం: సాయిఅభ్యంకర్, రచన-దర్శకత్వం: ఆర్జే బాలాజీ.