న్యూఢిల్లీ, జూన్ 9: రవాణా సదుపాయాలు సమకూర్చే ఉబర్..టెక్నాలజీ, ప్రొడక్ట్ విభాగాన్ని మరింత బలోపేతం చేయడానికి కీలక నిర్ణయం తీసుకున్నది. హైదరాబాద్తోపాటు బెంగళూరుల్లో ఉన్న కార్యాలయాల్లో మరో 250 మంది ఇంజినీర్లను రిక్రూట్ చేసుకోనున్నట్లు బుధవారం ప్రకటించింది. దేశీయంగా ఇంజినీరింగ్, ప్రొడక్ట్ విభాగాన్ని మరింత బలోపేతం చేయడానికి ముఖ్యంగా డెలివరీ, ఈట్స్, డిజిటల్ పేమెంట్స్, రిస్క్, ఫిర్యాదులు, మౌలిక, మార్కెట్ పరిస్థితులు, భద్రత, ఫైనాన్స్ టెక్నాలజీ విభాగాల్లో ఈ నియామకం చేపట్టనున్నట్లు తెలిపింది.