సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రిన్స్గానే ఉన్న రోజులవి. అప్పటి వరకు మురారి, ఒక్కడు లాంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చినా కూడా ఇంకా ఏదో కావాలని అభిమానులు కోరుకుంటున్న రోజులు. అలాంటి సమయంలో విడుదలైన సినిమా అతడు. అయినా కొన్ని సినిమాలు విడుదలైనపుడు పెద్దగా విజయం సాధించకపోవచ్చు కానీ తర్వాత వాటి విలువ తెలుస్తుంది. అతడు సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. మహేశ్ బాబు మార్కెట్తో సంబంధం లేకుండా ఈ సినిమాకు 2005లోనే రూ.23 కోట్లకు పైగా ఖర్చు చేశారు. దాంతో బిజినెస్ పూర్తిగా కాలేదు. 16 కోట్లకు మాత్రమే సినిమాను అమ్ముకున్నాడు నిర్మాత మురళీ మోహన్. అయితే థియేట్రికల్ కలెక్షన్స్ మాత్రం దానికి మించి వచ్చాయి. 2005, ఆగస్టు 10న విడుదలైన అతడుకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అసలు ఈ సినిమా అప్పట్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం..
నైజాం: 5.65 కోట్లు
సీడెడ్: 2.40 కోట్లు
ఉత్తరాంధ్ర: 1.40 కోట్లు
ఈస్ట్: 1.10 కోట్లు
వెస్ట్: 1.03 కోట్లు
గుంటూరు: 1.35 కోట్లు
కృష్ణా: 1.22 కోట్లు
నెల్లూరు: 0.75 కోట్లు
ఏపీ + తెలంగాణ: 14.90 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 2.40 కోట్లు
వరల్డ్ వైడ్: 17.30 కోట్లు
అతడు చిత్రం హిట్టా ఫట్టా అనే అనుమానం చాలా మందిలో ఉన్నాయి. బయ్యర్ల పరంగా చూసుకుంటే ఈ చిత్రం హిట్. ఎందుకంటే 16 కోట్ల బిజినెస్ చేస్తే.. 17.30 కోట్ల షేర్ వసూలు చేసింది. కోటికి పైగానే లాభాలు వచ్చాయి. అయితే నిర్మాత లెక్కల పరంగా చూసుకుంటే మాత్రం అతడు ఫ్లాప్. ఎందుకంటే ఈ చిత్రం 23 కోట్లకు పైగానే బడ్జెట్ అయింది. దాంతో నిర్మాతకు 8 కోట్ల నష్టం వచ్చింది. అయితే ఆ తర్వాత విడుదలైన పోకిరి బ్లాక్బస్టర్ కావడంతో అతడు సినిమాను మా టీవీ 5 కోట్లకు కొన్నది. ఆ తర్వాత 7 కోట్లకు దాన్ని రెన్యువల్ చేయించుకున్నారు. ఆ తర్వాత అలా కొనసాగుతూనే ఉంది. టీవీలో వేసిన ప్రతీసారి కూడా అతడు సినిమా మంచి టీఆర్పీ తీసుకొస్తుంది. ఇప్పటికి కొన్ని వందల సార్లు ఈ సినిమాను ప్రసారం చేసుంటారు. అలా నిర్మాత కూడా సేఫ్ అయ్యాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పవన్ కళ్యాణ్ సినిమా విషయంలో రానాకు అన్యాయం చేస్తున్నారా..?
సరికొత్త రికార్డులు సెట్ చేసిన మహేష్ బాబు
20 మిలియన్ల అభిమానాన్ని పొందిన రష్మిక
Prakash Raj Surgery | ప్రకాశ్ రాజ్కు సర్జరీ..అసలేం జరిగిందంటే..?