Sunny Deol | ప్రముఖ బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ (Sunny Deol) ప్రస్తుతం ‘గదర్ 2’ (Gadar 2) సినిమా సక్సెస్ను ఆస్వాదిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా బాక్సాఫిస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. విశేష ప్రేక్షకాదరణతో రూ. 400 కోట్ల మార్క్ దిశగా పరుగులు పెడుతోంది. అయితే, ఇదే సమయంలో సన్నీ డియోల్ ముంబై (Mumbai) జుహు (Juhu)లోని తన విల్లా వివాదంతో సతమతమవుతున్నాడు.
బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda)కు సన్నీడియోల్ రూ. 56 కోట్లు బకాయి పడ్డ విషయం తెలిసిందే. బ్యాంకుకు సన్నీడియోల్ రూ. 56 కోట్లు బకాయి పడటంతో ఈ మొత్తం వసూలు చేసుకునేందుకు ముంబైలోని జుహులో నటుడి లగ్జరీ విల్లాను బ్యాంకు వేలం వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు నోటీసులు కూడా జారీ చేసింది. అయితే, అనూహ్యంగా ఆ వేలం నోటీసులను బ్యాంకు ఉపసంహరించుకుంది. దీంతో ఈ అంశం కాస్తా చర్చనీయాంశమైంది. దీనిపై తాజాగా నటుడు స్పందించాడు. అది తన వ్యక్తిగత విషయం అని అన్నాడు. ‘నేను ఈ అంశంపై మాట్లాడాలనుకోవట్లేదు. ఇవి వ్యక్తిగత విషయాలు. ఇప్పుడు నేను ఏమి చెప్పినా ప్రజలు దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు’ అని వ్యాఖ్యానించారు.
2022 డిసెంబర్ నుంచి జరిమానా, వడ్డీతో సహా మొత్తం రూ.55.99 కోట్ల రుణం బాకీ పడ్డారని, దీనికి సంబంధించి ముంబైలోని జుహు (Juhu) ప్రాంతంలో ఉన్న ఆయన విల్లాను రూ.51.43 కోట్ల రిజర్వ్ ధరకు ఈనెల 25న ఈ-వేలం (e-auction) వేయనున్నట్టు ఆదివారం నోటీసులు ఇచ్చింది. విల్లాతో పాటు 599.44 చ.మీలలో ఉన్న సన్నీ డియోల్, ఆయనకు వ్యక్తిగత గ్యారంటీదారుగా ఉన్న ఆయన తండ్రి ధర్మేంద్ర భవనాలను కూడా వేలం వేస్తున్నట్టు అందులో పేర్కొన్నది. అయితే 24 గంటలు గడవక ముందే వేలం నోటీసులను వెనక్కి తీసుకుంది. సాంకేతిక కారణాల (Technical reasons) వల్ల నోటీసులను వెనక్కి తీసుకుంటున్నట్లు (withdrawal) బ్యాంకు ప్రకటించింది.
Also Read..
IndiGo | రక్తం కక్కుకుని చనిపోయిన ప్రయాణికుడు.. ఇండిగో ఫ్లైట్లో ఘటన
Elon Musk: జర్నలిస్టులకు ఆఫర్ ఇచ్చిన ఎలన్ మస్క్