IndiGo | ఇండిగో (IndiGo) విమానంలో ఓ ప్రయాణికుడు రక్తం కక్కుకుని (Vomits Blood) మరణించాడు. ఈ ఘటన ముంబై నుంచి రాంచీ (Mumbai-Ranchi Flight ) వెళ్తున్న ఇండిగో విమానంలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
సోమవారం సాయంత్రం ఇండిగో 6ఈ 5093 విమానం ముంబై నుంచి రాంచీ బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (Chronic Kidney Disease), క్షయవ్యాధి (Tuberculosis)తో బాధపడుతున్న ఓ 62 ఏళ్ల ప్రయాణికుడు అకస్మాత్తుగా రక్తం కక్కుకున్నాడు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని నాగ్పూర్ (Nagpur)లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
ఎయిర్పోర్టు నుంచి బాధితుడిని సమీపంలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తరలించారు. ఘటనపై ఇండిగో కూడా స్పందించింది. ‘ముంబై నుంచి రాంచీకి వెళ్తున్న ఇండిగో 6ఈ 5093 విమానంలో ఓ ప్రయాణికుడు అనారోగ్యం కారణంగా రక్తం కక్కుకున్నాడు. దీంతో విమానాన్ని మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా నాగ్పూర్కు మళ్లించాల్సి వచ్చింది. సదరు ప్రయాణికుడిని వైద్యచికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దురదృష్టవశాత్తు అతడు ప్రాణాలు కోల్పోయాడు’ అని ఎయిర్లైన్స్ ఓ ప్రకటనలో తెలిపింది.
Also Read..
Luna-25: లూనా-25 ఎందుకు కూలిందో చెప్పిన రష్యా
BRS | 2023 ఎన్నికల్లో పోటీచేసే బీఆర్ఎస్ అభ్యర్థులు..