హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో ఓ ప్యాసింజర్ నుంచి ఎయిర్పోర్టు అధికారులు భారీ మొత్తంలో బంగారాన్ని సీజ్ చేశారు. హెయిర్ క్లిప్ ద్వారా అక్రమంగా బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. రోడియం కోటింగ్(Rhodium Coating) ఉన్న ఆ క్లిప్లో సుమారు 397 గ్రాముల బంగారం ఉంది. మార్కెట్లో దాని విలువ 21 లక్షలుగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఆ ప్యాసింజర్ బ్యాగులో 22, 18 క్యారెట్లకు చెందిన రింగులు, గాజుల్ని కూడా సీజ్ చేశారు. ఇండిగో విమానంలో ఆ ప్యాసింజర్ షార్జా నుంచి వచ్చినట్లు అధికారులు చెప్పారు. రోడియం కోటింగ్ ఉన్న హెయిర్ క్లిప్ వీడియోను హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు తమ ఎక్స్ అకౌంట్లో పోస్టు చేశారు.
Based on pax profiling & efficient surveillance, @hydcus officers at RGIA intercepted one pax arriving from Sharjah by Indigo 6E 1422 on 21.8.23 and seized #gold weighing 397 gm valued at Rs 20.59 lakhs. @cbic_india @DDNewslive pic.twitter.com/jkM9Q5BT97
— CGST & Customs Hyderabad Zone (@cgstcushyd) August 21, 2023
బంగారం దెబ్బతినకుండా ఉండేందుకు సాధారణంగా రోడియం కోటింగ్ చేస్తారు. ఆభరణాలకు ఇలాంటి కోటింగ్ జరుగుతుంది. ఆ ఆభరణాలు స్క్రాచ్ కాకుండా ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది. ఎక్కువ శాతం వైట్ గోల్డ్కు రోడియం ఫినిషింగ్ వాడుతుంటారు. ఈ ఘటనకు చెందిన విచారణ కొనసాగుతున్నట్లు అధికారులు చెప్పారు.