ముంబై : బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ (Sunny Deol) ప్రస్తుతం గదర్ 2 గ్రాండ్ సక్సెస్ను ఆస్వాదిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న ఈ మూవీ లేటెస్ట్గా రూ. 500 కోట్ల క్లబ్కు చేరువైంది. అనిల్ శర్మ తెరకెక్కించిన ఈ బ్లాక్బస్టర్ మూవీ అనంతరం సన్నీ డియోల్ తన రెమ్యూనరేషన్ను భారీగా పెంచేసినట్టు సమాచారం.
ఇక తాను సినిమాలను నిర్మించే సాహసం చేయనని సన్నీ డియోల్ ఓ ఇంటర్వ్యూలో తేల్చిచెప్పడం హాట్ టాపిక్గా మారింది. నిర్మాతగా తన ప్రస్ధానం ముగిసిందని, ఇక నటనపైనే దృష్టిసారిస్తానని ఆయన సంకేతాలు పంపారు. గతంలో తాను సినిమాను ప్రొడ్యూస్ చేసిన ప్రతిసారీ దివాళా తీయడమే ఇందుకు కారణమని బీబీసీ ఆసియన్ నెట్వర్క్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సన్నీ డియోల్ చెప్పుకొచ్చారు.
తన కుమారుడు కరణ్ డియోల్ మూవీ పల్ పల్ దిల్ కే పాస్ సినిమాను ఆయన చివరిసారిగా ప్రొడ్యూస్ చేశారు. సినిమాలు తీసే పద్ధతి గతంతో పోలిస్తే ఈ పదేండ్లలో చాలా మార్పులకు గురైందని సన్నీ డియోల్ చెబుతున్నారు. గతంలో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్ధతో కమ్యూనికేషన్ ఉండేదని, కార్పొరేట్లు అడుగుపెట్టిన తర్వాత ఆ వ్యవస్ధతో సంబంధాలు తెగిపోయాయని అన్నారు. సినిమా ఎన్ని థియేటర్లలో ఆడుతుందనే సమాచారాన్ని కూడా వారు ఇవ్వరని చెప్పారు.
Read More :
Mohan Lal | మలయాళీలకు ఓనమ్ శుభాకాంక్షలు తెలిపిన మోహన్ లాల్