కొంతకాలంగా కంటెంట్ ప్రధానంగా వస్తున్న చిన్న సినిమాలు కూడా బాక్సాపీస్ వద్ద కాసుల పంట పండిస్తుండటం చూస్తూనే ఉన్నాం. శాటిలైట్, డిజిటల్ రైట్స్ (థియేటర్లో విడుదలయ్యాక స్ట్రీమింగ్ హక్కులు) విషయంలో చిన్న సినిమాలు మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. తాజాగా ఈ లిస్టులో సుధీర్ బాబు నటిస్తోన్న ‘శ్రీదేవి సోడా సెంటర్’ చేరిపోయింది. సుధీర్ బాబు సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులను జీటీవీ గ్రూప్ రూ.9 కోట్లకు దక్కించుకుందన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
తాజా సమాచారం ప్రకారం ఈ డీల్తో చిత్ర నిర్మాతలకు ఇప్పటివరకు సినిమాకు పెట్టిన ఖర్చులు తిరిగొచ్చాయట. మొత్తానికి సుధీర్ బాబు విడుదలకు ముందే తన నిర్మాతలకు మంచి మార్కెట్ కల్పిస్తున్నాడు. పలాస సినిమాతో అగ్ర నిర్మాతల దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్ కరుణ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. గోదావరి జిల్లా బ్యాక్ డ్రాప్ లో సినిమా సాగిపోనుంది. ఆనందో బ్రహ్మ చిత్రాన్ని తెరకెక్కించిన 70 ఎంఎం ఎంటర్ టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మణి శర్మ మ్యూజిక్ డైరెక్టర్.
ఇవి కూడా చదవండి..
సిల్వర్ స్క్రీన్ పై మరోసారి ప్రభాస్-కాజల్ సందడి..?
‘డెవిల్’గా కల్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ అదిరింది..వీడియో
తగ్గేదే లే అంటోన్న పూజాహెగ్డే..!
డేటింగ్ లో సారా అలీఖాన్..అతడెవరో తెలుసా…?
రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు..రష్మికకు అభిమాని ప్రశ్న
వెకేషన్ డేస్ను గుర్తు చేసుకున్న రకుల్..స్టిల్స్ వైరల్