యువ హీరో సుధీర్ కథానాయకుడిగా రచయిత హర్షవర్ధన్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై నారాయణ్దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మించనున్నారు. సోమవారం ఈ సినిమా ప్రకటన చేశారు. ‘ఓ విభిన్న కథాంశంతో రూపొందించబోతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. వినోదానికి పెద్దపీట ఉంటుంది. ఆగస్ట్ నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తాం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో తెలియజేస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: సోనాలి నారంగ్, శ్రిష్టి.