టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu),పరశురాం (Parasuram) కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టు సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). 2022 ఏప్రిల్ 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలిసిందే. అయితే సర్కారు వారి పాటకు సడెన్ బ్రేకులు పడ్డాయన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ సినిమా అనుకున్న సమయానికి రాకపోవచ్చని ఫిలింనగర్ లో జోరుగా టాక్ వినిపిస్తోంది.
ఇంతకీ ఇలా సడెన్ అప్ డేట్ రావడం వెనుక రెండు కారణాలున్నాయట. ఒకటి చాలా కాలంగా పెండింగ్లో పడ్డ మోకాలు ఆపరేషన్ కోసం మహేశ్ బాబు విదేశాల్లోకి వెళ్లాల్సి రావడం, రెండోది ఈ చిత్రం స్కిప్ట్ లో కొన్ని అంశాలు మహేశ్ కు నచ్చకపోవడం. స్క్రిప్ట్ విషయంలో క్లారిటీ వచ్చాకే తదుపరి షెడ్యూల్ను పూర్తి చేయాలని పరశురాంకు సూచించాడట. ఈ నేపథ్యంలో పరశురాం రైటర్స్ టీంతో కలిసి స్క్రిప్ట్లో మార్పులపై కసరత్తు మొదలుపెట్టినట్టు టాక్ నడుస్తోంది.
పోకిరి సినిమా లైన్లోనే సర్కారు వారి పాట ఉండబోతుందని ఇటీవలే ఓ హింట్ ఇచ్చి అభిమానుల్లో జోష్ నింపాడు మహేశ్ బాబు. తన ఫ్యాన్స్ కు ఏం కావాలో ఫుల్ క్లారిటీతో ఉండే ఈ సూపర్ స్టార్ హీరో మొత్తానికి అనుకున్నట్టు స్క్రిప్ట్లో మార్పుచేర్పులయ్యాకే షూటింగ్ వెళ్లాలనుకుంటున్నాడన్నమాట. కాస్త ఆలస్యమైనా సరే ఎంటర్ టైన్ మెంట్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాడని ఈ అప్ డేట్ చెబుతోంది. (Keerthy suresh) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Chandrabose hey bidda Song | ‘హే బిడ్డా ఇది నా అడ్డా’ పాటతో హోరెత్తించిన చంద్రబోస్
Akhanda:సెంచరీ కొట్టిన బాలయ్య.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న అఖండ