సినిమా ఫంక్షన్లకు హీరోలు, డైరెక్టర్లు ముఖ్య అతిథులుగా హాజరవడం సహాజమే. ఈ ట్రెండ్ కాస్త మారిపోయింది. హీరోయిన్లు కూడా చీఫ్ గెస్టులుగా ఈవెంట్స్ కు వెళ్తూ సందడి చేస్తున్నారు. గతంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఎవరు సినిమా ట్రైలర్ లాంఛింగ్ ఈవెంట్కు ముఖ్యఅతిథిగా హాజరైంది. ఆ తర్వాత పూజాహెగ్డే వరుడు కావలెను ట్రైలర్ లాంఛ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైంది. తాజాగా ఈ జాబితాలో ఇద్దరు స్టార్ హీరోయిన్లు కీర్తిసురేశ్ (Keerthy Suresh ), సాయిపల్లవి (Sai Pallavi) చేరిపోయారు.
ఈ ఇద్దరూ శర్వానంద్ (Sharwanand) నటిస్తోన్న ఆడవాళ్లు మీకు జోహార్లు (Aadavallu Meeku Joharlu) సినిమా ట్రైలర్ను లాంఛ్ చేయబోతున్నారు. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ఫిబ్రవరి 27న ప్రీ రిలీజ్ వేడుక జరుగనుంది. ఈ కార్యక్రమంలో ట్రైలర్ను లాంఛ్ చేయనున్నారు కీర్తిసురేశ్, సాయిపల్లవి. ఆసక్తికర విశేషమేంటంటే స్టార్ డైరెక్టర్ సుకుమార్ వేడుకకు చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడు. ఈ విషయాన్ని శర్వానంద్ ట్విటర్ లో స్పెషల్ పోస్టర్ పోస్ట్ చేస్తూ షేర్ చేసుకున్నాడు.
#AadavalluMeekuJohaarlu grand Pre Release Event on 27th FEB 💥
Blockbuster Director @aryasukku garu, The most talented & fan favourites @KeerthyOfficial & @Sai_Pallavi92 will grace the event. #AMJOnMarch4th@ImSharwanand @iamRashmika @DirKishoreOffl @ThisIsDSP @LahariMusic pic.twitter.com/P3YJVmtYVn
— SLV Cinemas (@SLVCinemasOffl) February 25, 2022
కిశోర్ తిరుమల డైరెక్షన్లో శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా..ఊర్వశి, ఖుష్బూ సుందర్, రాధికాశరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.