పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) నటిస్తోన్న ప్రాజెక్టు రాధేశ్యామ్ ( Radhe Shyam). యూనివర్సల్ ప్రేమకథతో ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే విజువల్ వండర్గా తెరకెక్కుతోంది రాధేశ్యామ్. తాజాగా ఈ చిత్రం నుంచి ఈ రాతలే సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ఎవరో వీరెవరో కలవనీ ఇరు ప్రేమికులా..ఎవరో వీరెవరో విడిపోని యాత్రికులా అంటూ రొమాంటిక్ మెలోడీ సాంగ్ స్లో మోషన్ లో సాగుతూ ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యేలా చేస్తోంది.
ప్రభాస్, పూజాహెగ్డే మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలతో కూల్కూల్గా సాగుతున్న ఈ పాటను మ్యూజిక్ లవర్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. రాధాకృష్ణ కుమార్ (Radha Krishna Kumar) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో పూజాహెగ్డే ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తోంది. మార్చి 11న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. కృష్ణకాంత్ రాసిన ఈ పాటను జస్టిన్ ప్రభాకరన్ కంపోజ్ చేశాడు.
యువన్ శంకర్ రాజా, హరిణి ఇవటూరి పాడారు. రాధేశ్యామ్ మూవీ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతోంది.