భారత చలన చిత్ర పరిశ్రమ (Indian Film Industry)లో ఉన్న టాలెంటెడ్ దర్శకుల్లో టాప్ లో ఉంటాడు స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli). ఈ దర్శకుడు సినిమా చేస్తున్నాడంటే చాలు..ఆ ప్రాజెక్టు ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందోనని అంచనాలు ఆకాశాన్నంటుతాయి. ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన జక్కన్న మరో భారీ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నాడు.
ఆ సినిమా ఏంటో ఇప్పటికే అర్థమై ఉంటుంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu)తో చేయబోయే సినిమా. యూఎస్ఏలో జరిగిన ఫిలిం ఫెస్టివల్లో రాజమౌళి తీసిన పలు సినిమాలు స్క్రీనింగ్ అయ్యాయి. ఈవెంట్కు హాజరైన రాజమౌళి ఇంట్రెస్టింగ్ విషయం చెప్పి మూవీ లవర్స్ తోపాటు మహేశ్ అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. మహేశ్తో తాను చేయబోయే కొత్త సినిమా వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్గా ఉండబోతుందని చెప్పాడు రాజమౌళి.
ప్రపంచవ్యాప్తంగా వివిధ లొకేషన్ల బ్యాక్డ్రాప్లో ఉండబోతున్న ఈ సినిమా కోసం కథ ప్రిపరేషన్ను జక్కన్న ఇప్పటికే మొదలుపెట్టేశాడని తాజా కామెంట్స్ చెబుతున్నాయంటున్నారు సినీ జనాలు.
ఇక యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలో మహేశ్ ను ఊహించుకుని తెగ సంబురాలు చేసుకుంటున్నారు అభిమానులు. మహేశ్బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న ఎస్ఎస్ఎంబీ 28 షూటింగ్ ప్రారంభమైంది.