SS Rajamouli | గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద భారతీయ సినిమా గొప్పతనాన్ని, ప్రాముఖ్యతను చాటి చెప్పిన తెలుగు చిత్రం బాహుబలి (Baahubali). ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో ఎపిక్ యాక్షన్ ఫిల్మ్గా తెరకెక్కిన ఈ చిత్రం రెండు పార్టులుగా తెరకెక్కిందని తెలిసిందే. ప్రభాస్, రానా, అనుష్క, సత్యరాజ్, రమ్యకృష్ణ.. ఇలా ప్రాంఛైజీలో నటించిన లీడ్ యాక్టర్లందరికీ దాదాపుగా పాన్ ఇండియా ఇమేజ్ దక్కిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
హాలీవుడ్ స్థాయిలో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు జక్కన్న. ఎన్నో రికార్డులు సృష్టించిన బాహుబలికి సంబంధించిన ఓ అరుదైన క్షణాన్ని అందరితో పంచుకున్నాడు ఎస్ఎస్ రాజమౌళి.లండన్లోని రాయల్ అల్బర్ట్ హాల్లో బాహుబలి : ది బిగినింగ్ (Baahubali: The Beginning) మ్యాజికల్ స్క్రీనింగ్ టైంను ఎప్పటికీ మరిచిపోలేను. ఆ రోజు ఇప్పటికీ నా కండ్లలో మెదులుతోందంటూ నిర్మాత శోభు యార్లగడ్డ, దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావుతో కలిసి దిగిన త్రోబ్యాక్ స్టిల్ను షేర్ చేశాడు.
ఇప్పుడు బాహుబలి: ది బిగినింగ్ స్టావెంజర్ ఓపెరా హౌస్లో ఆగస్టు 18న కాన్సర్ట్ స్క్రీనింగ్ అవుతున్న సినిమా కానుందన్న వార్తను పంచుకోవడం చాలా ఎక్జయిటింగ్గా ఉంది. స్టావెంజర్ సింఫోని ఆర్కెస్ట్రా బృందంతో ప్రత్యేక ప్రదర్శన ఉండబోతుందని తెలియజేశాడు జక్కన్న. ఇప్పుడీ త్రోబ్యాక్ స్టిల్తోపాటు కొత్త అప్డేట్ తెలిసిన మూవీ లవర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ బాక్సాఫీస్ను షేక్ చేసిన జక్కన్న సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఎస్ఎస్ఎంబీ 29ను ప్రకటించాడని తెలిసిందే. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ లాంఛ్ కాబోతుందని తెలుస్తోండగా.. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Can’t forget the magical screening of #Baahubali: The Beginning at the Royal Albert Hall in London, which is still stuck in my eyes.
And now we are excited for another splendid Film in Concert screening of Baahubali-1 in Norway at Stavanger Opera House on August 18th, featuring… pic.twitter.com/QaEUf2zewN
— rajamouli ss (@ssrajamouli) August 16, 2023