Sobhita Dhulipala | ఫ్రాన్స్లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (Cannes Film Festival) అట్టహాసంగా జరుగుతోంది. ఈ వేడుకల్లో బాలీవుడ్కు చెందిన పలువురు స్టార్స్ సందడి చేస్తున్నారు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రెస్లను ధరించి రెడ్ కార్పెట్పై హొయలు పోతున్నారు. బాలీవుడ్ నుంచి కూడా పలువురు ప్రముఖులు ఈ కేన్స్లో సందడి చేస్తున్నారు. మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్, నటి ఊర్వశి రౌతేలా, శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala), కియారా అద్వానీ, అదిరి రావు హైదరీతో పాటు పలువురు తారలు కేన్స్లో మెరిశారు.
శోభిత తొలిసారి రెడ్ కార్పెట్ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్పుల్ కలర్ కోర్డెలియా జంప్సూట్లో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. అయితే, శోభిత కేన్స్లో ధరించిన ఇలాంటి డ్రెస్సే.. గతంలో బాలీవుడ్ నటి అతియా శెట్టి (Athiya Shetty) ఓ ఫ్యాషన్ ఈవెంట్లో ధరించింది. గతేడాది మార్చిలో ముంబైలో జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్లో అతియా సేమ్ డ్రెస్లో ర్యాంప్ వాక్ చేసి షో టాపర్గా నిలిచారు. ఇప్పుడు సేమ్ డ్రెస్నే శోభిత ధరించడంతో నెటిజన్లు గతంలో అతియా ఫొటోను, ఇప్పటి శోభిత ఫొటోను మెర్జ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ డ్రెస్ను ప్రముఖ డిజైనర్ నమ్రత జోషిపురా రూపొందించారు. ఆమె వెబ్సైట్ ప్రకారం ఈ డ్రెస్ ఖరీదు రూ.1.8 లక్షలుగా ఉంది.
Also Read..
Urvashi Rautela | కేన్స్లో ఊర్వశి మెరుపులు.. కస్టమ్ మేడ్ డ్రెస్లో రెడ్ కార్పెట్పై సందడి
Amit Shah | లోక్సభ ఎన్నికల్లో 272 సీట్లు గెలవకపోతే బీజేపీ ప్లాన్ బి ఏంటి..?.. అమిత్ షా సమాధానమిదే