శ్రీనాథ్ మాగంటి హీరోగా నటిస్తున్న చిత్రం ‘మెన్షన్ హౌస్ మల్లేష్’. బాల సతీష్ దర్శకుడు. గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల కథానాయికలుగా నటిస్తున్నారు. మార్చి 6న ప్రేక్షకుల ముందుకురానుంది. గురువారం చిత్ర టీజర్ను హీరో విశ్వక్సేన్, దర్శకుడు తరుణ్భాస్కర్ ఆవిష్కరించారు. రూటెడ్ కథాంశంతో సహజత్వానికి దగ్గరగా అనిపించే చిత్రమిదని, విభిన్న కథగా ఆకట్టుకుంటుందని హీరో శ్రీనాథ్ మాగంటి తెలిపారు.
అద్భుతమైన కథ ఇదని, ఆర్టిస్టులందరూ సూపర్ పర్ఫార్మెన్స్ కనబరిచారని విశ్వక్సేన్ అన్నారు. వినోదంతో పాటు చక్కటి సందేశం కలబోసిన కథాంశమిదని దర్శకుడు తెలిపారు. రాజేష్, మురళీధర్ గౌడ్, రాజ్ కుమార్ కసిరెడ్డి, సాయిప్రసన్న తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అమ్మముత్తు, సంగీతం: సురేష్ బొబ్బిలి, రచన-దర్శకత్వం: బాలసతీష్.