పచ్చని ప్రకృతిని అందించేందుకు ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన కార్యక్రమం ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’. సినీ తారలు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ మొక్కలను పెంచాలనే సందేశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నారు. తాజాగా నాయిక శ్రీలీల హైదరాబాద్ గచ్చిబౌలిలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ ప్రాంగణంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…‘ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది. గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా ఇప్పటిదాకా 17 కోట్లకు పైగా మొక్కలు నాటడం గొప్ప విషయం’ అని చెప్పింది. ఈ కార్యక్రమంలో ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ కో ఫౌండర్ రాఘవ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ డైరెక్టర్ శేరి చిన్నప్ప రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.