మహేష్చంద్ర, శ్రీదేవి, సూర్యతేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘విశాలాక్షి’. ‘నిను వీడని నీడను నేనే’ ఉపశీర్షిక. శ్రీహరి రాజు దర్శకుడు. ఈ చిత్ర ట్రైలర్ను శుక్రవారం సీనియర్ నిర్మాత సి.కల్యాణ్ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘హారర్ థ్రిల్లర్ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. విశాలాక్షి ఎవరనేది ఆసక్తిని రేకెత్తిస్తుంది’ అన్నారు. ఈ సినిమాలో తాను సాఫ్ట్వేర్ ఇంజినీర్ పాత్రలో నటించానని చంద్రమహేష్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ కవల, కథ, మాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం: నిమ్స్ శ్రీహరి రాజు.