మెదడుమీద కొవిడ్-19 తీవ్ర ప్రభావం చూపుతుందని ‘జర్నల్ ఆఫ్ బ్రెజిలియన్ సొసైటీ ఆఫ్ ట్రోపికల్ మెడిసిన్’ అధ్యయనంలో ఇటీవల వెల్లడైంది. కరోనా వైరస్ మెదడును తీవ్ర ఒత్తిడికి గురి చేస్తుందనీ, ఆ ప్రభావంతో జ్ఞాపక శక్తి మందగించడం, నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు, మనుషులను గుర్తించడంలో వైఫల్యం.. వంటి దుష్ఫ్రభావాలు కనిపిస్తున్నాయని ఆ పరిశోధన పేర్కొంది. కొవిడ్నుంచి కోలుకున్న తర్వాతకూడా కొంతకాలం పాటు మునుపటి చురుకుదనం లోపించవచ్చని ఆ సంస్థ పరిశోధకులు తెలిపారు. కొవిడ్నుంచి కోలుకున్న తర్వాత యోగా, ధ్యానం, ప్రశాంత వాతావరణం వంటివి మనసుకు, తద్వారా మెదడుకూ ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తాయని వారు వివరించారు.