నట్టి కరుణ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం డీఎస్జే(దయ్యంతో సహజీవనం). నట్టికుమార్ దర్శకత్వంలో క్రాంతి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమాలోని ‘మేఘాలలో హరివిల్లులా’ అనే గీతాన్ని ఆదివారం చిత్రబృందం విడుదలచేసింది. చిన్మయి ఈ పాటను ఆలపించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘మహిళా ప్రధాన కథాంశంతో తెరకెక్కుతున్న హారర్ సినిమా ఇది. తనను మోసం చేసిన నలుగురు అబ్బాయిలపై ఓ యువతి ఆత్మగా మారి ఎలా ప్రతీకారం తీర్చుకున్నదనేది ఆసక్తికరంగా ఉంటుంది. కశ్మీర్లోని అందమైన లొకేషన్స్లో పాటను ఐదు రోజుల్లో చిత్రీకరించాం. ఈ గీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ నెల 16న ఐదు భాషల్లో సినిమాను విడుదలచేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అని తెలిపారు. రాజీవ్, సుపూర్ణ మలాకర్, హారీష్చంద్ర ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రవిశంకర్.