హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ) : ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ (ఐఎఫ్ఎస్)2023 పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాలలో 147 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్టు యూపీఎస్సీ ప్రకటించింది. వీరిలో రాష్ర్టానికి చెందిన పోతుపురెడ్డి భార్గవ్ ఆలిండియా 22వ ర్యాంకు, మన్నెం అజయ్కుమార్ 44వ ర్యాంకు, భార్గవ్కుమార్ 124వ ర్యాంకు సాధించారు.
ఫలితాల వివరాలను యూపీఎస్సీ తన అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది. దేశవ్యాప్తంగా మొత్తం 150 పోస్టుల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో జనరల్ క్యాటగిరీలో 62 పోస్టులు, ఈడబ్ల్యూఎస్లో 15, ఓబీసీలో 50, ఎస్సీ 22, ఎస్టీకి 11 పోస్టులు ఉన్నట్టు పేర్కొన్నారు.