వేశ్యగా నటించడం తేలికైన విషయం కాదు. ప్రవర్తన, శారీరక భాష, మాటతీరు, వేషధారణ, అందం.. ఇలా ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించాలి. ‘గంగూభాయ్ కతియావాడి’ సినిమాలో ఈ తరహా పాత్రే అలియాభట్కు జాతీయ అవార్డును కట్టబెట్టింది. ఇప్పుడు సోనాక్షి సిన్హా వంతు వచ్చింది.
‘గంగూభాయ్’ తీసిన సంజయ్లీలా బన్సాలీనే ఇప్పుడు ‘హీరామండి’ అనే వెబ్సిరీస్ తీస్తున్నారు. ఈ సిరీస్లో ఫరీదాన్ అనే వేశ్యగా సోనాక్షి సిన్హా నటిస్తుండటం విశేషం. మనీషా కొయిరాల, రిచా చద్దా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సిరీస్కి సంబంధించిన పోస్టర్లూ, వీడియోలు సోషల్మీడియాలో సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో రీసెంట్గా సిరీస్లోని ‘తిలాస్మి బహెన్’ అంటూ సాగే గీతాన్ని మేకర్స్ విడుదల చేశారు. ఇది సోనాక్షి సిన్హాపై చిత్రీకరించిన గీతం. విటులతో కలిసి తాగిన మత్తులో ఫరీదాన్ ఆడిపాడే ఈ పాట ఇప్పుడు బాలీవుడ్లో చర్చనీయాంశమైంది.
రీసెంట్గా ఈ సిరీస్ ప్రమోషన్లో భాగంగా ముంబయ్లోని గెయిటీ థియేటర్కి వచ్చింది సోనాక్షి. అంతే.. వేలాదిగా వచ్చిన అభిమాన సందోహంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. ఈ గీతంలో సోనాక్షి అందానికీ, అభినయానికి అభిమానులేకాదు, సగటు ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోతున్నారట. ఈ పాట గురించి సోనాక్షి మాట్లాడుతూ “హీరామండి’ నా కెరీర్లోనే స్పెషల్. ఇందులో ఫరీదాన్ క్యారెక్టర్ కోసం ఎంతో రీసెర్చ్ చేశాను. మంచి పాత్ర ఇచ్చి పోత్సహించిన సంజయ్సార్కి ధన్యవాదాలు’ అంటూ ఆనందం వెలిబుచ్చింది. మే1 ఈ సిరీస్ ప్రసారం కానుంది.