సంక్రాంతి సినిమాల విషయంలో కొన్ని వెబ్సైట్స్, మీడియా సంస్థలు తప్పుడు వార్తలు రాసి పరిశ్రమలో ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టించాయని..భవిష్యత్తులో అలాంటి వార్తా కథనాలపై చర్యలు తీసుకుంటామని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలి హెచ్చరించాయి. ఈ మేరకు మంగళవారం ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ‘ఏదైనా వార్తను రాసేముందు సంబంధిత దర్శకనిర్మాతలకు సంప్రదించి వాస్తవాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీసేలా వార్తలు రాయడం మంచిపద్దతి కాదు. ఇక నుంచి సోషల్మీడియాలో, ఇతర వేదికలపై నిరాధారమైన వార్తలు రాస్తే చర్యలు తీసుకుంటాం’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.