Dulquer Salmaan | ‘సీతారామం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు మలయాళీ అగ్ర హీరో దుల్కర్ సల్మాన్. ప్రస్తుతం ఆయన వెంకీ అట్లూరి దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి ‘లక్కీ భాస్కర్’ అనే టైటిల్ను ఖరారు చేశారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ‘నమ్మశక్యంకాని విధంగా ఉన్నత శిఖరాలకు చేరిన ఒక సాధారణ మనిషి కథ’ ఇదని చిత్రబృందం పేర్కొంది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందించే చిత్రమిదని, వినూత్న కథతో ఆకట్టుకుంటుందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, సమర్పణ: శ్రీకర స్టూడియోస్, రచన-దర్శకత్వం: వెంకీ అట్లూరి.