బంజారాహిల్స్,ఆగస్టు 25: ఏ కాలంలోలైనా విభిన్నమైన శైలిలతో జనాన్ని ఒప్పించడమే మంచి కవి లక్షణమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఆకృతి సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో జ్ఙానపీఠ అవార్డు గ్రహీత డా. సి. నారాయణరెడ్డి పేరుతో ఏర్పాటు చేసిన లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డును సుప్రసిద్ధ సినీ గేయరచయిత చంద్రబోస్కు గురువారం మంత్రి నిరంజన్రెడ్డి చేతులమీదుగా అందజేశారు.
బంజారాహిల్స్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్గుప్తా.. కేంద్ర సంగీత నాటక అకాడమీ సభ్యులు డా.ఎస్పీ.భారతితో కలిసి చంద్రబోస్కు పురస్కారాన్ని అందజేశారు.
మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబోస్ పాటలు నచ్చని తెలుగువారు ఉండరని, భారతీయ సాహిత్య రంగంలో శిఖరంగా నిలిచిన సినారె పేరుతో ఏర్పాటు చేసిన పురస్కారాన్ని అందుకోవడానికి చంద్రబోస్కు అన్ని విధాల అర్హత ఉందన్నారు. సినారె బాటలో పయనిస్తూ అనేక మరపురాని గీతాలను తెలుగువారికి అందించిన ఘనత చంద్రబోస్కు దక్కుతుందన్నారు.