శ్రీసింహా హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘దొంగలున్నారు జాగ్రత్త’ శనివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. సతీష్ త్రిపుర దర్శకుడు. డి.సురేష్బాబు, సునీత తాటి నిర్మాతలు. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రమోషనల్ వీడియోలో సిమ్కార్డ్ దొంగిలించడం గురించి ప్రస్తావించడం కథపై ఆసక్తిని రేకెత్తించేలా అనిపించింది. ఇదే వీడియోలో సినిమాకు సంబంధించిన సాంకేతిక నిపుణుల బృందాన్ని కూడా పరిచయం చేశారు. తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని ముఖ్యపాత్రను పోషిస్తున్న ఈ చిత్రంలో ప్రీతిఅస్రాని కథానాయికగా నటిస్తున్నది. ఈ చిత్రానికి కెమెరా: యశ్వంత్ సి, సంగీతం: రోహిత్కులకర్ణి, ఆర్ట్: గాంధీ నడికుడికర్, ఎడిటర్: గ్యారీ బీహెచ్, నిర్మాణ సంస్థలు: సురేష్బాబు, గురు ఫిల్మ్స్, దర్శకత్వం: సతీష్ త్రిపుర.