Siddu Jonnalagadda | సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెలుసు కదా’. నీరజ కోన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. శ్రీనిధిశెట్టి, రాశీఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. నేడు సిద్ధు జొన్నలగడ్డ జన్మదినం సందర్భంగా కొత్త పోస్టర్ను విడుదల చేశారు.
‘ముక్కోణపు ప్రేమకథా చిత్రమిది. సిద్ధు జొన్నలగడ్డ పాత్ర కొత్త పంథాలో ఉంటుంది. కథానుగుణంగా సంగీతానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది’ అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: జ్ఞానశేఖర్ బాబా, సంగీతం: తమన్, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా, రచన-దర్శకత్వం: నీరజ కోన.