ఈ ఏడాది క్రాక్ సినిమా సక్సెస్తో ఫుల్ జోష్ మీదున్నాడు టాలీవుడ్ (Tollywood) డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni). హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), గోపీచంద్ మలినేని కాంబినేషన్లో మాస్ ఎంటర్ టైనర్ (#nbk107) రాబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ కాంబో ప్రాజెక్టుపై ఆసక్తికర వార్తను మేకర్స్ అందరితో పంచుకున్నారు. కోలీవుడ్ భామ శృతిహాసన్ను హీరోయిన్గా ఫైనల్ చేశారు.శృతిహాసన్కు టీంలోకి స్వాగతం అంటూ అధికారిక ట్విటర్ ఖాతాలో ఓ స్టిల్ను విడుదల చేశారు.
తాజాగా కొత్త విడుదల తేదీ ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. శృతిహాసన్ అందరూ అనుకున్నట్టుగానే శృతిహాసన్ను గోపీచంద్ మలినేని మరోసారి తన హీరోయిన్గా ఎంపిక చేసుకున్నాడు. గోపీచంద్-శృతిహాసన్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు బాక్సాపీస్ను షేక్ చేశాయి. ఈ సెంటిమెంట్ బాలకృష్ణ సినిమాకు కూడా పనిచేస్తుందని ధీమాగా ఉన్నాడీ డైరెక్టర్.
బాలకృష్ణ నటిస్తోన్న అఖండ (Akhanda) షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు ముస్తాబవుతుంది. ఈ చిత్రంలో ప్రగ్యా జైశ్వాల్ (Pragya Jaiswal) హీరోయిన్గా నటిస్తోంది. డిసెంబర్ 2న ఈ మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ జరుగుతున్నట్టు వార్తలు వస్తుండగా..అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Janhvi Kapoor Langa Voni | లంగావోణిలో జాన్వీకపూర్..దీపావళి లుక్ అదిరింది
Shyam Singha Roy | స్పెషల్ అట్రాక్షన్గా ‘శ్యామ్ సింగరాయ్’ భామల ఫస్ట్ లుక్
SS Rajamouli wish suryavanshi team | మొన్న అల్లు అర్జున్..నేడు రాజమౌళి