Shilpa Shetty | మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ముంబయిలోని జుహు ప్రాంతంలో ఉన్న ఇల్లు, పావ్నా సరస్సు సమీపంలో ఉన్న ఫామ్హౌస్ను ఖాళీ చేయాలని ఈడీ నోటీసులు పంపింది. శిల్పా దంపతులు దాఖలు చేసిన పిటిషన్పై గురువారం విచారణ జరిగే అవకాశం ఉన్నది. నోటీసులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని బుధవారం హైకోర్టు ఈడీని ఆదేశించింది. గతంలో ఈడీ ఆయా ఆస్తులను అటాచ్ చేసింది. గత నెల 27న భవనాలను ఖాళీ చేయాలని నోటీసుల్లో పాల్గొన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ముంబయి జోనల్ ఆఫీస్ తాత్కాలికంగా రూ.97.79కోట్ల విలువైన స్థిర, చరాస్తులను మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అటాచ్ చేసింది. ముంబయికి చెందిన ‘వేరియబుల్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే సంస్థ 2017లో ‘గెయిన్ బిట్కాయిన్ పోంజీ స్కీమ్’ను నిర్వహించింది.
అయితే, బిట్కాయిన్లో పెట్టుబడులు పెడితే నెలకు 10శాతం లాభాలు వస్తాయని ఆశ చూపి మల్టీ-లెవల్ మార్కెటింగ్ (MLM) పద్ధతిలో ఏజెంట్ల ద్వారా ముంబయి, ఢిల్లీ నగరాల్లో అమాయకుల నుంచి రూ.6,600 కోట్లు వసూలయ్యాయి. ఈ మోసం బయటపడడంతో సంస్థ, దాని ప్రమోటర్లపై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఈ స్కామ్లో మాస్టర్మైండ్ అమిత్ భరద్వాజ్ నుంచి రాజ్కుంద్రా 285 బిట్కాయిన్స్ను తీసుకున్నట్లు ఈడీ తెలిపింది. ఉక్రెయిన్లో బిట్కాయిన్ మైనింగ్ ఫామ్ను ఏర్పాటు చేయాలని రాజ్కుంద్రా ప్రణాళికలు వేసినట్లు దర్యాప్తు సంస్థ పేర్కొంది. ఈ కాయిన్స్ ఇప్పటికీ ఆయన వద్దనే ఉన్నాయని.. మార్కెట్ విలువ రూ.150కోట్ల వరకు ఉంటుందని పేర్కొంది. ఈ క్రమంలోనే రాజ్కుద్రా ఆస్తులను అటాచ్ చేసింది. అయితే, ఆ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు.