శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. తిరుమల కిషోర్ దర్శకుడు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. గురువారం టీజర్ను విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ ‘పూర్తి కుటుంబ కథాచిత్రమిది. ప్రచార చిత్రాలతో పాటు టీజర్కు అనూహ్యమైన స్పందన వచ్చింది.బిజినెస్పరంగా కూడా ఈ చిత్రానికి వచ్చిన బజ్తో చాలా హ్యాపీగా వున్నాం. మహిళలే మహారాణులు అని ఈ సినిమా ద్వారా తెలియజెప్పాం.ఈ నెల 25న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.